వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మ దగ్ధం..
యదార్థవాది టౌన్ హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అక్కన్నపేట చౌరస్తాలో కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ హుస్నాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత ధ్వర్యంలో ధర్నా చేశారు .. ఈ సంద్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఓ వైపు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజేపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత, ఎంపీపీ లు భూక్యమంగా, లకావత్ మానస, మార్కెట్ చైర్ పర్సన్ ఎడబోయిన రజిని, బీఅర్ఎస్ మండల నాయకులు, యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు.