వడగండ్ల వాన నష్టం పై నివేదిక కోరిన: మంత్రి
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం తో కలిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కలెక్టర్ అనురాగ జయంతిని ఆదేశించారు..జిల్లాలో శనివారం కురిసిన వడగళ్ల వానతో జరిగిన నష్టాలను పంట నష్టపోయిన రైతుల వివరాలను క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు పరిశీలించి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు.