వాగులోకి ఎవరు వెళ్ళద్దు.
- మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లొద్దు.
- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. వరద ప్రవాహాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా వాగు ప్రమాదంగా ప్రవహిస్తున్నందున ప్రజలెవరు రావద్దని ప్రజలను ఇండ్లకు పంపించారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ కొండపాక, కొమరవెల్లి మండలాల మీదుగా అధిక నీటితో బస్సాపూర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుందని, వాగు ఇంకా రెండు, మూడు రోజుల వరకు ఇదే ఉధృతి కొనసాగేలా ఉందని వాగు వద్దకు ప్రజలు రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోహెడ, రాజగోపాల్ పేట పోలీస్ లను ఆదేశించారు.. వర్షాలు తగ్గేవరకు రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళదని సర్పంచులు, తాసిల్దార్లు ఎంపీడీవోలు ప్రజాప్రతినిధులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/07/IMG-20230727-WA0006-1024x678.jpg)