20.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణవిద్యా సంస్థల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

విద్యా సంస్థల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

విద్యా సంస్థల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

సిద్దిపేట యదార్థవాది

జీఓ నెంబర్ 1ని తుంగలో తొక్కి అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్రీ చైతన్య, అల్ఫోర్స్ పాఠశాలలను తక్షణమే సీజ్ చేసి యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ పి డి ఎస్ యూ విద్యార్థి నాయకులు జిల్లా విద్యాశాఖాదికారికి వినతి పత్రము అందించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.విద్యానాథ్ మాట్లాడుతూ విద్యాశాఖ అనుమతులు లేకుండా జిల్లా కేంద్రంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హుస్నాబాద్ లో అల్ఫోర్స్, చేర్యాల లో శ్రీ చైతన్య పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారని తక్షణమే ఈ విద్యాసంస్థల పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ప్రదీప్, పట్టణ అధ్యక్షుడు ప్రణయ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్