శిలాజినగర్ లో హనుమాన్ శివ పంచ నవగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు
యదార్థవాది ప్రతినిధి దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజి నగర్ గ్రామంలో ప్రజలందరి సహకారంతో గ్రామ సర్పంచ్ మాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడురోజలుగా కొనసాగుతున్నా హనుమాన్ దేవస్థానం ఉత్సవాలు విగ్రహ ప్రతిష్ట, శివ పంచ నవగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు వేద పండితులచే హోమం యజ్ఞ యాగాలు గ్రామంలోని అన్ని కుటుంబాలు యజ్ఞంలో పాల్గొన్నారు.రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుతున్నారు.శనివారం సాయంత్రం పోచమ్మ బోనాలు అంగరంగా వైభవంగా నిర్వహించనున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, వేంకటగిరి తండా సర్పంచ్ పాతూలోతు పెంటవ్వ బాలకిషన్ హాజరైనారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాలక వర్గం,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.