శోభకృత్ తెలుగు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు
యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్
హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక సి.వి రామన్ ఉన్నత పాఠశాల నందలి శోభకృత్ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ ఉగాది వేడుకలలో విద్యార్థులు ఉగాది పచ్చడి తయారుచేసి అందరికి అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాయిత నారాయణరెడ్డి మాట్లాడుతూ షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో మనిషి జీవితం సుఖసంతోషాలతో ఉండాలని అందరూ తెలుగు ఉగాది నూతన సంవత్సరంలో అందరూ కలిసిమెలిసి సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆయురారోగ్య అష్టశ్వర్యాలతో తులతూగాలని
అలాగే విద్యార్థుల్లో ప్రేరణ పెంపొందించేందుకు లీడ్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిబిరం నిర్వహించరు. కార్యక్రమములో ఉపాధ్యాయబృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.