శ్రీ రాజా వేణుగోపాల స్వామి ఆలయంలో మైనంపల్లి ప్రత్యేక పూజలు.
దుబ్బాక యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక చెల్లాపూర్ లో ప్రసిద్ధ పురాతనమైన ఆలయం శ్రీ రాజా వేణుగోపాలస్వామి ఆలయాన్ని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి తో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీసాల కృష్ణునిగా ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉందని మైనంపల్లి కొనియాడారు గ్రామస్తుల స్థానికుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని దర్శించుకున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రానున్న రోజుల్లో పురాతన ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మల్లారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.