సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన: మంత్రి
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకతీతంగా పాడి పంటలతో రైతన్నలంతా సమృద్ధి వర్షాలతో సుఖ సంతోషాలతొ ఉండాలని వీరభద్ర స్వామిని కోరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.