23.5 C
Hyderabad
Wednesday, September 17, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

విశ్వనాథ్‌ కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు – సీఎం జగన్..

యదార్థవాది ప్రతినిది

విశ్వనాథ్‌ కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారన్నారు సీఎం జగన్. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. విశ్వనాథ్‌గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారని తెలిపారు ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని వెల్లడించారు. ఇక అటు కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్