సంపూర్ణ అంధత్వ నిర్మూలన లక్ష్యంగా కంటి వెలుగు..జిల్లా కలెక్టర్
సిరిసిల్ల: యదార్థవాది ప్రతినిది
సిరిసిల్ల పట్టణం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు అనురాగ్ జయంతి..ఈ సందర్బంగా మాట్లాడుతూ సంపూర్ణ అంధత్వ నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమమని, తెలంగాణ కంటి వెలుగు లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. దృష్టి లోపాలు ఉన్న వారికి అవసరాన్ని బట్టి రీడింగ్ గ్లాస్ లు అందిస్తున్నామని, ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఫేజ్ ల వారీగా అన్ని గ్రామాలు, వార్డులలో కంటి వెలుగు శిబిరాలను, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యకమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య ,మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ విజయ్ కుమార్, పలువురు కౌన్సిలర్ లు పాల్గొన్నారు.
