
సచివాలయం త్వరలో సిద్ధం..!
హైదబాద్:
నూతన సచివాలయం నిర్మాణం పూర్తికావస్తోంది.. జనవరి 18 లోగా నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వం నిర్ణయించింది..అప్పటివరకు సచివాలయ భవనం పూర్తిగా సిద్ధం కాకపోవచ్చు అని తెలుస్తుంది.. 18నా పూజలు నిర్వహించేందుకు కొంత బాగాన్ని సిద్దం చేయాలని అధికారులు నిర్ణయించారు.. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కొన్ని మంత్రిత్వ శాఖ కార్యాలయలు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటివరకు ముఖ్యమంత్రి సిఎస్ కార్యాలయాలు 90% పూర్తయినట్లు తెలుస్తోంది.. సచివాలయంలో పాలన కార్యక్రమాలు సాగించేందుకు మరో మూడు నెలల సమయం పట్టవచ్చు.. జనవరి18న ప్రభుత్వం పూజలు నిర్వహిస్తుందా? లేదా? అన్న విషయం త్వరలో తెలియనుంది. రూ.617 కోట్ల అంచనా తో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి 2019 ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.







