27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణసత్వరమే న్యాయం చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

సత్వరమే న్యాయం చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

సత్వరమే న్యాయం చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కరింప చేయడంలో రిసెప్షన్ అధికారులు చురుకుగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రోజున జిల్లాలోని పోలీస్ స్టేషన్ రిసెప్షన్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు తగు న్యాయం లభింస్తుందన్న నమ్మకాన్ని కలిగించడంలో పోలీస్ రిసెప్షన్ అధికారులు కీలకంఅని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన రెండు రకాల వివరాలతో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ఫిర్యాదుల పరిష్కారం వివరాలను పై స్థాయి అధికారులు కూడ పరిశీలిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, సమర్థవంతమైన సేవలందించే విభాగాలకు చెందిన అధికారులకు ప్రతి నెలా రివార్డులను అందజేయడం జరుగుతుందని, ఫిర్యాదుల పరిష్కారం పైనే స్టేషన్ పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ అనిల్ కుమార్, రిసెప్షన్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్