సాంకేతిక నైపుణ్యతను అంది పుచ్చుకోవాలి
-రాష్ట మంత్రి సీతక్క
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: వెంగళరావు నగర్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థను సందర్శించిన మంత్రి సీతక్క. ఈ సంద్భంగా మంత్రి సీతక్కకు ఆప్యాయంగా స్వాగతం పలికిన విద్యార్థులు.. విద్యార్థినిలతో మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్న అనంతరం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినుల కేరింతల నడుమ వారితో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థినులకు కేక్ తినిపించిన సీతక్క.. మంత్రి సీతక్క ఆప్యాయత, అనురాగాన్ని చూసి సంతోష పడ్డ విద్యార్థులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదని, నేను కూడా హాస్టల్లోనే ఉండి చదువుకున్నానని, హాస్టల్లో ఎంతోమంది స్నేహితులు ఉంటారు వారితో రకరకాల ఐడియాస్ ను, సంతోషాన్ని, బాధని పంచుకోవచ్చు.. ఒకరికొకరు చేయూతగా నిలవచ్చు.. భవిష్యత్తును కూడా ప్లాన్ చేసుకోవచ్చని అన్నారు. రాష్ట ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుని ఉన్నత స్థానంలోకి రావాలని ఆకాంక్షించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక నైపుణ్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రోత్సహిస్తోందని, స్కిల్ యూనివర్సిటీ ని ఇప్పటికే ప్రారంభించుకున్నామని, జాబ్ మార్కెట్ కు అనుగుణంగా ఉపాధి రంగాన్ని ఎంచుకోవాలి.. లక్ష్యాన్ని తోటి ఈరోజు నుంచే అడుగులు వేయడం ప్రారంభించి లక్ష సాధనలో విజయం సాధిస్తారని మంత్రి సీతక్క అన్నారు. వెంగళరావు నగర్ లోని ప్రభుత్వ శిశువిహార్ ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క.