సిటీ సర్వీసెస్ ప్రారంభించిన..పువ్వాడ అజయ్
ఖమ్మం: యదార్థవాది ప్రతినిది
ప్రజల సౌకర్యయర్థం ఖమ్మం సిటీ బస్ స్టాండ్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ..ఖమ్మం పాత బస్ స్టాండ్ ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సంకల్పింతో సిటీ బస్ స్టాండ్ గా మార్చి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎంతో చరిత్ర ఉన్న ఖమ్మం బస్స్టాండ్ ను రూ.50 లక్షలతో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. సిటీ బస్స్ సర్వీసెస్ లను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ ను పునరుద్ధరణ చేయడం పట్ల స్థానిక వ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం ఖమ్మం వచ్చే ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ గజ మాలలతో మంత్రి అజయ్ కుమార్ ని సత్కరించారు. ఎంపి నామా నాగేశవరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.