34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణసీఎం దత్తత గ్రామనికి జాతీయ అవార్డు

సీఎం దత్తత గ్రామనికి జాతీయ అవార్డు

సీఎం దత్తత గ్రామనికి జాతీయ అవార్డు

గజ్వేల్ యదార్థవాది

న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి గిరి రాజ్ సింగ్ చేతుల మీదుగా గ్రామ్ ఉర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ అవార్డును సోమవారం సిద్ధిపేట
జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ముజామిల్ ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ మర్కుక్ మండల ఎర్రవల్లి గ్రామనికి జాతీయ పంచాయతీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. 2023 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక కేటగిరి అవార్డు కింద గ్రామ్ ఉర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కార్ కింద ప్రథమ స్థానంలో సిద్ధిపేట జిల్లాలోని మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో 519 ఇండ్లకు గానూ 414 ఇండ్లకు సౌర పలకల ద్వారా సౌర శక్తితో విద్యుత్ వాడడం జరుగుతున్నది. ఈ ప్రాజెక్టులో ఒక్కో యూనిట్ కి 1కేవి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఒక్కో యూనిట్ కి గాను 1,57,000 ఖర్చయిందని ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90000 సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా బీహెచ్ఈఎల్ వారి సహకారం 60000 రూపాయలు 7వేల రూపాయలు ఇంటి యజమాని వాటా ఉందని సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామ ప్రజల సహకారంతో ప్రజా చైతన్యం, పంచాయతీ పాలక వర్గం సమన్వయం, పంచాయతీ అధికారుల కృషితో సాధ్యమైందని, సోమవారం కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న అధికారులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలియచేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్