సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన.. చింతా ప్రభాకర్..
సదాశివపేట యదార్థవాది
సదాశివపేట పట్టణంలోని పలు వార్డులలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా రోడ్డు సమస్యతో ఇబ్బంది పడ్డారని రోడ్డు సమస్యకు పరిష్కారం అయిందని పట్టణంలో కోటి 80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని త్వరలోనే 3,4వ వార్డులో రోడ్డు సమస్యకు తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడు జయమ్మ, కమిషనర్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.