21.2 C
Hyderabad
Wednesday, December 3, 2025
హోమ్తెలంగాణసైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి
పెట్టుబడి పెట్టకండి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు1930 డయల్ 100లకు తక్షణమే కాల్ చేయలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజెన్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆశ భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని ఎవరికైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని మాయ మాటలతో అతని వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుందని భయంతో ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ పాన్ కార్డు అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారని ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి పోన్స్ వాడుతూ ఉంటాం ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి మన బ్యాంకులు నుండి డబ్బులు సులువుగా దోచుకుంటున్నారని అందువల్ల మన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదని తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్