23.9 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణహత్య కేసు సేదించిన పోలీసులు

హత్య కేసు సేదించిన పోలీసులు

హత్య కేసు సేదించిన పోలీసులు

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిధి

మల్కాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసు చేదించిన నిజామాబాద్ పోలీసులు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు కేసు వివరాలు వెల్లడించారు మల్కాపూర్ తాండ కేశవత్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నరేష్ షేక్ రజిని పట్టుకొని విచారించగా తన స్నేహితుడైన నిజాముద్దీన్ కత్తితో పొడిచి చంపానని నేరని అంగీకరించాడు వివరాల్లోకెళ్తే ఎండి నిజాముద్దీన్ షేక్ హజి తొమ్మిది సంవత్సరాలుగా ఇద్దరు స్నేహితులుగా కలిసిమెలిసి ఉన్నారు గత ఆరు నెలల క్రితం నిజాముద్దీన్ పని చేసే వద్ద హాజీని కొట్టినాడు. హజీకి పని దొరకకుండా నిజాముద్దీన్ చేసినాడు. నిజాముద్దీన్ కాలు విరిగిపోయినప్పుడు హజి చేసిన సేవలు కూడా గుర్తు పెట్టుకోకుండా అతన్నితో గొడవ పడినందున అతని నమ్మించి చంపివేయాలని అనుకున్నాడు హజి. ఆ విధంగా అతడు మూడు నెలల క్రితం అతన్ని దావత్ చేసుకుందాం అని పిలిచి మల్కాపూర్ శివారులోని అడవికి మందు తీసుకొని వెళ్లి అక్కడ నిజాముద్దీన్ కు మందు త్రాగిపించి , తాగిన మత్తులో నిజాముద్దీన్ ఉండగా హాజి అతని కత్తితో కడుపులో ఇష్టం వచ్చినట్టు పొడిచి చంపేసినాడు తర్వాత అతని ఎవరు గుర్తుపట్టకుండా అతనిపైన కట్టెలు వేసి కాల్చి వేసినాడు. అని చెప్పి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు హాజి పై సెక్షన్ 384/2022 u/s 302 201 కేసు నమోదు చేసి జ్యూడిషల్ రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ACPవెంకటేశ్వర్ సి ఐ జె. నరేష్ పి. ఎస్ SIP G లింబాద్రి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్