రైతులకు డెయిరీ రుణాలు..
హుస్నాబాద్: 10 యదార్థవాది ప్రతినిది
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో రైతులకు డెయిరీ రుణాలు ఇవ్వనున్నట్లు సహకార సంఘం అధ్యక్షులు పేర్యాల దేవేందర్ తెలిపారు.. కోహెడ మండలంలోని అరుహులైన రైతులకు డెయిరీ, చేపల పెంపకం కొరకు మార్టిగేజ్ రుణాలు ఇవ్వనున్నట్లు దేవేందర్ తెలిపారు. మంగళవారం ఆరేపల్లి గ్రామనికి చెందిన చెంద్ర నాయక్ తండా రైతులకు కరీంనగర్ పాల ప్రోడక్ట్ కంపెనీ లిమిటెడ్ వారు ట్రై పాడ్ అగ్రిమెంట్ ద్వారా 18 మంది రైతులకు రూ.10,80,000/- ఇవ్వడం జరిగిందనిఅన్నారు. రుణాలు కావలసిన రైతులు కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సి ఈ ఓ ముంజ మల్లికార్జున్, డైరెక్టర్ బానోతు బాలు, మిల్క్ డెయిరీ అద్యక్షులు లావుడ్య లకపతి, రైతులు లావుడ్య దేవేందర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.