సముద్రంలో చిక్కుకున్న 9 మందిని ప్రాణాలు కాపాడిన కావలి రూరల్ పోలీసులు
యదార్థవాది ప్రతినిధి కావలి
కావలి రూరల్ మండలంలోని చెన్నాయపాలెం సముద్ర తీరంలో పడవలో సరదాగా తిరుగుదామనుకొని ముసునూరుకు చెందిన 9 మంది యువకులు మధ్యాహ్నం ఫైబర్ పడవను మాట్లాడుకొని ఒకటిన్నర కిలోమీటర్ వెళ్లిన తరువాత పడవ మోటార్ చెడిపోయింది దిక్కు తోచని స్థితిలో ఏమి చేయాలో అర్ధం కాక 112 కు కాల్ చేసిన పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు హుటాహుటిన మరో బోటులో బాధితుల వద్దకు చేరుకొని భరోసా కల్పించి, క్షేమంగా ఒడ్డుకు చేర్చారు కావలి రూరల్ పోలీసులు ఆనందభాష్పలతో కృతజ్ఞతలు తెలిపిన 9 మంది బాధితులు. సంతోషంతో ధన్యవాదములు తెలిపిన బాధితుల కుటుంబ సభ్యులు స్థానికులు ప్రజలు.