హుజురాబాద్ బై ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ల ఫలితం వెల్లడైంది. మొత్తం 753 ఓట్లకు గాను మెజారిటీ ఓట్లు టిఆర్ఎస్ కు వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ఆదిక్యత కనబరిచారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగియడంతో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పనిలో సిబ్బంది ఉన్నారు.