పెట్రోల్ డీజిల్ పై సుఖాన్ని తగ్గించడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని ఈ దోపిడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రియాంక గాంధీ కేంద్రంపై నిప్పులు కక్కారు.