మాజీ ప్రధాని పీవీ నర్సింగరావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన.. మంత్రి ఎర్రబెల్లి
హనుమకొండ 23 డిసెంబర్22
భారతదేశ ప్రధానిగా గొప్ప రాజనీతజ్ఞుడు, దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ప్రతిష్టతను పెంచిన గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు గారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లాలోని పివి విగ్రహానికి పూలమాల తో నివాళులు అర్పించారు. ఇది ప్రధానిగా ఉన్నప్పుడు దేశం చాలా ముందుకెళ్లిందని నిజాయితీగా పనిచేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, ఇంత గొప్ప వ్యక్తి మన వరంగల్ జిల్లా తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణంగా ఉందని, అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలిపారు.