
లారి కారు డి..!
సిరిసిల్ల 27 డిసంబర్
సిరిసిల్ల జిల్లా మూడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.. కారుని ఎరువుల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఎరువుల లోడ్తో కోరుట్ల వైపు వెళ్తుండగా మూడపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రుద్రంగి మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.







