రైతు రాజు అయితే… రాజు కూడా రైతే మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రానికి మంత్రి కన్నాతల్లికి రైతుకు బిడ్డే..
పాలకుర్తి 27 డిసెంబర్ 27
స్వగ్రామంలో సొంత పొలంలో పనులు జరుగుతుంటే, పొలంలో గొర్రు కొట్టిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నాడు రైతులు వ్యవసాయం దండగ అంటే నేడు రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పండగా చేసిండు.. వ్యవసాయాన్ని మంత్రులు పొలం పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధనలో అడుగులు వేస్తాం అనడమే కాదు..వ్యవసాయం చేస్తాం.. రైతు రాజు అయితే… రాజు కూడా రైతే అని మంత్రి రుజువు చేశారు. కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారిందని, గతంలో నెర్రెలు పారిన పొలాలు… స్వరాష్ట్రంలో పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయి.. అన్నదాత కళ్లలో ఆనందం నిండింది, అపర భగీరధుడు కేసీఆర్ ఆలోచనలతో ప్రాజెక్టులలో, నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే… చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే… మంత్రులు సొంత పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తుంటే…ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయి… నా తెలంగాణ కోటి ఎకరాల మగాణా అన్న నినాదం మల్లి నిజం అయ్యింది.