సంక్రాంతి పండుగాకు 94 ప్రత్యేక రైళ్ల…
హైదరాబాద్ 27 డిసంబర్
పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్ ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేది వరకు వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా.. దేశంలోని రద్దీ గల ప్రాంతాలకు నడుస్తున్నాయని తెలిపింది.