26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
హోమ్తెలంగాణనిరుపేదలసేవే నిజమైన తృప్తి

నిరుపేదలసేవే నిజమైన తృప్తి

నిరుపేదలసేవే నిజమైన తృప్తి

చేర్యాల: 4 జనవరి

చేర్యాల పట్టణంలోని మనో చేతన పాఠశాలకు సముద్రాల చారిటబుల్ నుండి వాటర్ ప్యూరిఫైడ్ కోసం రూ 20 వేల నగదును మనో చేతన పాఠశాలకు అందజేశారు. నిరుపేదలకు సేవలందించడంలోనే నిజమైన తృప్తి కలుగుతుందని సముద్రాల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్రాల భూమయ్య జ్ఞాపకార్థం సముద్రాల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని చిన్నచిన్న ఆర్థిక సహాయాన్ని, మనో చేతన పాఠశాలలో ఉన్న మతిస్థిమితం, ఆర్థోపెడిక్ పిల్లలకు సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దుర్గ, సాయి శ్రీహస్, మన చేతన పాఠశాల ఫౌండర్ వెంకట్ చుక్క, పాఠశాల ఉపాధ్యాయులు రమాదేవి కాశెట్టి, భాగయ్య, ముస్త్యాల బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్