రాష్టంలో బిజెపి దే అధికారం..!
మెదక్: 5 జనవరి
రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని, సునాయాసంగా మేమే అధికారంలోకి వస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.. గురువారం మెదక్ హెడ్ క్వార్టర్ ద్వారక గార్డెన్ లో ఏర్పాటు చేసిన బిజెపి శక్తి కేంద్ర ఇన్చార్జిల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని విధాల తెలంగాణకు సహకరించిన.. కేంద్రంపై విషం చిమ్ముతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






