గ్రూపు-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి
ఈ ఏడాదిలో మరో గ్రూపు-1 నోటిఫికేషన్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించే గ్రూపు-1 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్)కు పకడ్బందీ గా నిర్వహించడనికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్టంలోని 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో 1,26,499 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, మూడు వారాల్లోనే ఫలితాలను విడుదల చేస్తామని, గ్రూపు-1 నోటిఫికేషన్లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా మరికొన్ని, పోస్టులను కలిసే ఆస్కారంముందని అన్నారు. కమిషన్ ప్రధాన కార్యాలయంలో గౌతమ్సవాంగ్ విలేకర్లతో మాట్లాడారు. ‘గ్రూపు-1 ప్రధాన పరీక్షను స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు వెల్లడించిన 90 రోజుల్లోగా నిర్వహిస్తాం.. ఆగస్టులోగా నియామకాలు పూర్తి చేస్తమంనరు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోస్టుల భర్తీకి ఆమోదం లభిస్తే ఈ ఏడాదిలో కొత్తగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్ జారీచేస్తాం. త్వరలో గ్రూపు-2 నోటిఫికేషన్ ఇస్తాం’ అని గౌతమ్ సవాంగ్ తెలిపారు.