బ్రహ్మోత్సవాలకు కెసిఆర్ రావాలి..
హైదరాబాద్: 9 యదార్థవాది ప్రతినిది
శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి రమేష్.. వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 13నుండి కానున్నాయని, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు సిఎం కెసిఆర్ కు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.. ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ ఈఓ నాగేశ్వర రావు, ప్రధాన అర్చకులు రవీందర్, విక్రంత్ జోషి, మధుకర్ శర్మ, పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొన్నారు..