సిఎస్ సోమేశ్ కుమార్ రాజానామా చేయాలి..బండి సంజయ్
హైదరాబాద్: 10 యదార్థవాది ప్రతినిది
* కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్ ఆంధ్ర కు వెళ్ళాలి..
* కేసీఆర్ ఎప్పుడు చట్టాలను, రాజ్యాంగా నిబంధనలను గౌరవించలేదు..
* తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రం తేవాలి..
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట అద్యక్షుడు బండి సంజయ్ మంగళవారం ప్రకటన… ప్రచురణార్థం విడుదల చేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తూ సీఎస్ బాధ్యతల నుండి తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయాలని, 2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కిరని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరోజు చట్టాలను, రాజ్యాంగా నిబంధనలను గౌరవించలేదు. ఆంద్ర కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం అని తెలిపారు. తెలంగాణకు కేటాయించబడ్డ ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డ సోమేశ్ కుమార్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారు. 317 జీవోసహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారన్నారు. హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం శాఖ, తనకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్ ను పావుగా వాడుకున్నారునిబ తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేశ్ కుమార్ తొలగించి తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణ కేటాయించి వ్యక్తిని సీఎస్ గా నియమించాలి, ఏపీకి కేటాయించబడ్డ అధికారులను ఆ రాష్ట్రానికి బదలాయించాలి. అట్లాగే తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని బీజేపీ పార్డి డిమాండ్ చేస్తుందని అన్నారు.