27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం

ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం

ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం

న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది

జీవో నంబర్‌1పై సుప్రీంకోర్టు..

ఏపీలో రహదారులపై రోడ్డుషోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 1పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఆ జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్‌ 1పై జోక్యం చేసుకోలేమని.. ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం దీనిపై విచారణ చేపడుతుందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్‌ బెంచ్‌ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 23న జీవో నంబర్‌ 1పై విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్