32.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

యదార్థవాది 22 జనవరి అమరావతి:

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్‌ పరిస్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా 5వ తేదీ నాటికి 90-95% ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ప్రభుత్వం చెల్లిస్తోంది.మిగిలిన 5% మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వగలం’ అని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటనవిడుదలచేశారు.ఉద్యోగుల జీతాలు, పింఛను బిల్లులు 90-95% వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్‌ చేస్తారని, వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల 5లోగా పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు. రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు (వేస్‌ అండ్‌ మీన్స్‌- చేబదుళ్లు) అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని వివరించారు. ఇంతకుముందు, ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగుతోందని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్