నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొన్న పోలీసులు
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ముగ్గురుని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బారత ప్రభుత్వ ఉత్తర్వు NO.6-2/2017-SD.IV(pt) నిబందనలను ఉల్లంఘిస్తూ నిషేధిత (బిటి-3) నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్సై లచ్చన్న, సిబ్బంది లతో కలిసి, బోయపల్లి బోర్డు వద్ద మంచిర్యాల వైపు వస్తున్న కారు, బొలెరో ట్రాలి వాహనం ఆపి వారిని తనిఖి చేయగా బొలెరో వాహనం లో పైన వడ్ల బస్తాలు వేసుకొని వాటి క్రింద సుమారు 10,00000/- విలువైన 5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత (బిటి-3) నకిలీ విత్తనాలు గుర్తించిన పోలీసులు. నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నా శ్రీరాముల నవీన్, ఒడ్నాల రాకేష్, మోర్ల వెంకట స్వామి పట్టుబడగా ఇద్దరు పారిపోయారు.. కేసునమోదు విచారణ నిమిత్తం నకిలీ పత్తి గింజలను సరఫరా చేయడానికి ఉపయోగించిన బోలోరే ట్రాలి, ఎస్కార్ట్ ఉపయోగించిన కారు, నకిలీ (BT) పత్తి విత్తనాలను స్వాదిన పర్చుకున్న వాటిని, నిందితులను తాండూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది..