జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడదాం..
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ఫోరం కార్యాలయంలో వార్షకోత్సవ సన్నాహక సమావేశం బుదవారం జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో అధ్యక్షులు వంగ రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఫోరం వార్షికోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి సేవలను గుర్తించి సన్మానం చేయలని, జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అంశాలను, సమస్యల పరిష్కారానికి ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వం ముందు ఉంచాలని సమావేశం తీర్మానించనైనది. త్వరలో వార్షికోత్సవ నిర్వహణ తేదీని ప్రకటించనున్నట్లు సమావేశం తెల్పింది. ఈ సమావేశంలో జిల్లా సమన్వయ కర్త తుమ్మనపల్లి శ్రీనివాసు, కార్యదర్శులు అమ్మన చంద్రారెడ్డి, కాజీపేట సత్యనారాయణ, భైరవ రెడ్డి, పి. వీరారెడ్డి, ప్రభుదాస్, దబ్బెట యాదగిరి, చొప్పదండి సుధాకర్ తదితరులు పాల్గొనరు..