బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల
యదార్థవాది ప్రతినిధి న్యూఢిల్లీ
దేశరాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను బుధవారం
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించారు… పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్,వర్క్ ఏజెన్సితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని, నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి అదేశించారు. మంత్రి వెంట ఉర్దూ అకాడెమీ ఛైర్మన్ ముజీబుద్దిన్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, బీఅర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.