27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి రెఫరెండం ఈ ఎన్నికల ఫలితాలు

మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి రెఫరెండం ఈ ఎన్నికల ఫలితాలు

మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి రెఫరెండం ఈ ఎన్నికల ఫలితాలు

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

త్రిపుర నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంధర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద మిఠాయిలు తినిపించుకొని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటురి శ్రీకాంత్ మాట్లాడుతూ మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి రెఫరెండం ఈ ఎన్నికల ఫలితాలు అని అన్నారు. దేశం మొత్తం బీజేపీ వెంట ఉందని సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ నినాదంతో పని చేస్తున్న బీజేపీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రాంతం, భాషా తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జండా ఎగురుతుందనీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో కాషాయ జండా ఎగుర బోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ విజయము గురించి చర్చ జరగొద్దని BRS గ్యాస్ ధర పై నిరసనలు చేశారని అన్నారు. విద్యుత్, రిజిస్టేషన్, బస్సు చార్జీలు, పెట్రోల్ చార్జీలు, ఇలా అన్ని చార్జీలు పెంచి గ్యాస్ చార్జీల గురించి నిరసన తెలపడం సిగ్గు చేటు అని అన్నారు. అంతర్జాతీయంగా క్రుడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో రోజుకో విద్యార్థి ఆత్మ హత్య చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్