అఖిల భారత సర్వీసు క్షేత్ర స్థాయి శిక్షణ..
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసు శిక్షణ లో భాగంగా శనివారం క్షేత్ర స్థాయి శిక్షణ కోరకు డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుండి 20 మంది శిక్షణ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగిందని జిల్లా పరిపాలన అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. తేదీ 04.03.2023 నుండి 10.03.2023 వరకు గ్రామస్థాయి శిక్షణ కొరకు ముస్తాబాద్ మండలం లోని నామపూర్ గ్రామం, తంగళ్ళపల్లి మండలంలోనే బస్వపూర్, ఎల్లారెడ్డిపెట్ మండలం లోని రాజన్నపేట మరియు వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఆయా గ్రామాల లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ప్రజల సామాజిక ఆర్థిక జీవన పరిస్థితులకు సంబంధించి, అలాగే జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవగాహన పెంచుకోవడం జరుగుతుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సర్వీసుల శిక్షణ అధికారులు, జిల్లా, మండల, అధికారులు పాల్గొన్నారు.
