24 C
Hyderabad
Tuesday, September 16, 2025
హోమ్తెలంగాణఇండ్లు లేని నిరుపేదలు కనిపించడం లేదా?

ఇండ్లు లేని నిరుపేదలు కనిపించడం లేదా?

ఇండ్లు లేని నిరుపేదలు కనిపించడం లేదా?

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

పేద ప్రజలకు రెండు పడకల ఇండ్లు ఇవ్వాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి అందించారు.. ప్రతి పేదవాని సొంతింటి కల నెరవేర్చాలని రెండు పడకల ఇండ్లు పేరుతో పేదలను మోసం చేయడం సరికాదని నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఘోరంగా విఫలమయ్యారని అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలు కనిపించడం లేదా? అనేక మంది ఇళ్ల స్థలాలు లేక చిన్న ఇళ్లలోనే రెండు మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని వెంటనే నిరుపేదలకు రెండు పడకల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన జిల్లా అధ్యక్షులు అంకార్ గణేష్ , పార్టీ ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్, బీసీ అధ్యక్షులు కారంపూరి రవి, మైనారిటీ అధ్యక్షులు ఇస్మాయిల్ ఖాన్, మహిళా అధ్యక్షురాలు బుడిగే హరిని , సినియర్ నాయకులు అల్లకుంటా పాండు, మహిళ నేతలు శశిరేఖ, శ్వేతా, కవిత, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్