మంత్రుల అండదండలు లేనిదే లీక్ సాధ్యమా
– లీకేజీలపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు
– గుండాల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
యదార్థవాది ప్రతినిధి హైరాబాద్
గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో
నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో గ్రూప్-1 పేపర్ లీక్ చేసినవారి పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మంత్రుల అండదండలు లేకుండానే లీకేజీ వ్యవహారం సాధ్యపడుతుందా అని అన్నారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు నోరు మేదపడం లేదని ప్రశ్నించారు. కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరగటం లేదని తెలంగాణ వస్తే పిల్లల బ్రతుకులు మారుతాయని ఉద్యోగలు వస్తాయని అనుకుంటే ఏ ఒక్కరికి మేలు జరగలేదని అన్నారు. ఈ రాస్తారోకోలో అండెం సంజీవ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/03/IMG-20230319-WA0015-1.jpg)