పంచాయతీ పాలకవర్గాన్ని నిర్బందించిన గ్రామస్తులు..
యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామాన్ని హుస్నాబాద్ మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించరు.. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలను హుస్నాబాద్ మండలంలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో చౌటపల్లి గ్రామం లేకపోవడంతో తమ గ్రామాన్ని కూడా హుస్నాబాద్ మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అక్కన్నపేట వద్దు హుస్నాబాద్ ముద్దు అంటూ నినాదాలు చేస్తున్న గ్రామ ప్రజలు ..
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/03/IMG-20230321-WA0003-1-1024x460.jpg)