21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణపాత నేరస్తులపై నిఘా పెట్టాలి: జిల్లా ఎస్.పి

పాత నేరస్తులపై నిఘా పెట్టాలి: జిల్లా ఎస్.పి

పాత నేరస్తులపై నిఘా పెట్టాలి: జిల్లా ఎస్.పి

యదార్థవాది ప్రతినిధి మెదక్

చేగుంట పోలీస్ స్టేషన్ ను మంగళవారం తనిఖీ చేసిన జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని.. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని ప్రతిరోజు వారి క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేయాలని ఎస్.పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు. పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ ఆన్ లైన్ లో కేసుల వివరాలు ఇప్పటికప్పుడు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనదేనని సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని కేసులను ఛేదించే విధంగా ఉండాలని బ్లూ కోట్స్ పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేయాలని సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించలని అన్నారు. కార్యక్రమంలో రామాయంపేట సి.ఐ. శ్రీ.చంద్రశేఖర్ రెడ్డి చేగుంట ఎస్.ఐ.శ్రీ.ప్రకాష్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్