తెలంగాణ రైతాంగ పోరటంలో తొలి ఆమరుడు దొడ్డి కొమురయ్య
– పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఘనంగా కొమురయ్య జయంతి
యదార్థవాది ప్రతినిది నిజామాబాద్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలో దొడ్డి కొమురయ్య 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిపారు. నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) జి. మధుసుదన్ రావు దొడ్డి కొమురయ్య 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1927 ఎప్రిల్ 3న వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో గొర్రె కపర్ల కుటుంబంలో జన్మించిన కొమురయ్య నిజాం పరిపాలన వ్యతిరేకముగా పోరాడడం జరిగిందని అనేక సంఘాలను ఏర్పాటు చేశారని 1946 జులై 4 న కడివెండి గ్రామంలో దొర పై రజాకార్లపై తిరగబడ్డారు. తెలంగాణ రైతాంగ పోరటంలో తొలి ఆమరుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన వ్యక్తి, అప్పటికి ఆయన వయస్సు 20 సంవత్సరాలు కూడా నిండలేదని అన్నారు. కార్యాక్రమంలో ఎ.ఓ శ్రీ శ్రీనివాస్, సూపరింటెండెంటులు శంకర్, గోవింద్, మక్సూద్, సి.సి.ఆర్.బి, IT, పోలీస్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ కాంప్లెంటు సెల్, స్పెషల్ పార్టీ, పోలీస్ కార్యలయం, హోమ్ గార్డు సిబ్బంది పాల్గొన్నారు.