నాణ్యత ప్రమాణాలు పాటించాలి :ఫుడ్ ఇన్స్ పెక్టర్
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటల్లు, టిఫిన్ సెంటర్లలో తయారు చేస్తున్న ఆహార నాణ్యతను పరీక్షించారు. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని పలు హొటల్లు, టిఫిన్ సెంటర్లకు జరిమానా విధించారు. హుస్నాబాద్ పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేశామని, అందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్, కిచెన్ లను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించని పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లకు పెనాల్టీ వేశారు వినియోగదారులు ఏదైనా హోటల్లలో, టిఫిన్ సెంటర్లలో ఆహార నాణ్యత విషయంలో లోపాలను గుర్తిస్తే వెంటనే పురపాలక శాఖకు తెలియజేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో తమ వంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంట జవాన్ గడిపే సారయ్య పైసా శ్రీకాంత్ ప్రభాకర్ పాల్గొన్నారు.