30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణదళిత జర్నలిస్టులను ఆదుకోవాలి..

దళిత జర్నలిస్టులను ఆదుకోవాలి..

దళిత జర్నలిస్టులను ఆదుకోవాలి..

జగిత్యాల యదార్థవాది

జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో దళిత జర్నలిస్టులకు దళిత బంధు, ఇండ్ల స్థలాలు, రెండు పడకల ఇల్లు ఇవ్వాలని తెలంగాణ ఎస్ సి ఎస్ టి వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద వినతిపత్రం ఇవడం జరిగింది.. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు ఆమాలు చేయాలని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న వర్కింగ్ దళిత జర్నలిస్టులకు ఇల్లు లేదా ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ పత్రికలు చానల్లో ఏండ్ల తరబడి అనేకమంది దళిత గిరిజన జర్నలిస్టులు పనిచేస్తున్నారని వారంతా ఆర్థిక స్తోమత లేక పత్రిక యజమాన్యాల దోపిడీ భరించలేక ప్రభుత్వాల భరోసా లేక తీర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన జర్నలిస్టుల యూనియన్లు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రంలో వివిధ పత్రికల్లో చానల్లో దళిత గిరిజన జర్నలిస్టులుగా పనిచేస్తూ ఆర్థిక స్తోమత లేక అనేక అవస్థలు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు అమలు చేయాలని కోరారు. దళిత బంధు పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కలిసి వినతి పత్రం అందజేశామని ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదని ప్రభుత్వం స్పందించి రెండో విడత దళిత బంధు పథకంలో దళిత జర్నలిస్టులను గుర్తించి అమలు చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు దాసం కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల సతీష్, గొడిసెల రమేష్, బలిజ సంతోష్, పింజరి శివ తదితరలు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్