జవాన్ అనిల్ భౌతిక కాయానికి ఘన నివాళి..
సిరిసిల్ల యదార్థవాది
జమ్మూ – కాశ్మీర్ లో సైనికులు ప్రయాణించిన హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో ప్రమాదానికి గురైన ఘటనలో మృతి చెందిన సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అమర జవాన్ పబ్బాల అనిల్ భౌతిక కాయానికి శనివారం మల్కాపూర్ గ్రామంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, ఎంపి బండి సంజయ్, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ పవన్ కుమార్ లు, ఆర్మీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పూల మాలలు వేసి నివాళులు అర్పించాను. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అమరులు అనిల్ అంతిమ యాత్ర లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జై జవాన్….అమర జవాన్ పబ్బాల అనిల్ అమరహే అంటూ నినదించారు. అమరవీరులు అనిల్ త్యాగాన్ని ప్రజలు మరువలేరనీ…