భారీగా నగదు స్వాధీనం.!
బెంగళూరు యదార్థవాది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే..
దీంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నట్టు తెలుస్తోంది..
తాజాగా బెంగళూరు, మైసూరులో ఏకకాలంలో బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వీరు ఆర్థిక సాయం చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేపట్టారని ఈ దాడుల్లో రూ.15 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు తెలుస్తోంది..