34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమన ఊరు మన బడి పథకంఫైన సమీక్ష సమావేశం నిర్వహించిన. జిల్లా కలెక్టర్...

మన ఊరు మన బడి పథకంఫైన సమీక్ష సమావేశం నిర్వహించిన. జిల్లా కలెక్టర్…

మన ఊరు మన బడి పథకంఫైన సమీక్ష సమావేశం నిర్వహించిన. జిల్లా కలెక్టర్…

సిద్దిపేట యదార్థవాది

హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకి మండలంలో మన ఊరు మన బడి పథకంఫైన సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్….
సమీకృత జిల్లా కార్యాలయంలో మంగళవారం మన ఊరు మన బడి పథకం కింద కేటాయుంచిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మొత్తంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథక పనులు నత్తనడకన సాగుతుందని అసహనం వ్యక్తం చేశారు. బెజ్జంకి మండలంలో ఇంకా మెరుగుపర్చుకోవాలని ఈ పథకం లో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ (కిటికీలు, డోర్లు, స్లాప్, ఫ్లోర్) రిపేర్లు తప్పని వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చెయ్యాలని, ఎంపిడిఓ, ఎంపిఓ లు రోజు వారిగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్ పనులను పర్యవేక్షణ చేసి పూర్తి చేపించాలని అన్నారు.
ఎఈలు ఇప్పటి వరకు అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలని, కలరింగ్ ఏజెన్సీ కి మెథర్ మెంట్ షిట్ అందించాలని, ఎంపిడిఒ ఎంపిఓ లు ఏఈ లకు ఎప్పటి కప్పుడు తోడ్పాటునందించాలని, మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ రాములు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్