30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఇంట్లో సంక్షేమం.ఇంటి ముంగిట అభివృద్ధి.: ఎమ్మెల్యే వొడితల సతీష్

ఇంట్లో సంక్షేమం.ఇంటి ముంగిట అభివృద్ధి.: ఎమ్మెల్యే వొడితల సతీష్

ఇంట్లో సంక్షేమం.ఇంటి ముంగిట అభివృద్ధి.: ఎమ్మెల్యే వొడితల సతీష్

-సైదాపూర్ మండల కేంద్రంలో 50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం

-గౌరవెళ్లి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 1 లక్ష 6 వేల ఎకరాలకు సాగునీరు

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలానికి వరద కాలువ కాదు జీవ కాలువ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు…
సైదాపూర్ మండలంలోని 13 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలం అన్నీ రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలతో సైదాపూర్ మండలం సస్యశ్యామలం అయిందని, మొలంగూర్ నుండి హైదరాబాద్ వెళ్ళు డబుల్ రోడ్ నిర్మాణం, ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్లు, మిషన్ భగీరథతో ఇంటి ఇంటికి నీరు అందిచడం జరుగుతుందని, తెలంగాణ ఉద్యమం సమయంలో పోరాట స్పూర్తి నింపిన మండలం సైదాపూర్ అని గుర్తు చేసుకున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయనుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పకుండా కేవలం కులం, మతం పేరిట ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని, రోజు రోజుకు శ్రుతి మించుతున్న బిజెపి దుర్మార్గాలను ఎండ గట్టి ఎక్కడి కక్కడ బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. కరీంనగర్ జిల్లాలో 2 లక్షల 50 వేల పార్టీ సభ్యత్వం కలిగి రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన కార్యకర్తల సంక్షేమం విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అగ్ర భాగాన ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించడంతోపాటు ఆపదలో అండగా ఉంటున్నామని తెలిపారు.. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జి.వి రామకృష్ణ రావు మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్షణ్ రావు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్