సైబర్ నేరాలను నివారించ వచ్చు: జిల్లా ఎస్పీ అఖిల్
-సైబర్ నేరాలకు గురైతే టోల్ ఫ్రీ 1930కు, డయల్ 100 చేయాలి
సిరిసిల్ల యదార్థవాది
సమాజంలో ప్రతి వ్యక్తి రెండు (ఆశ, భయం) అంశాలపై నియంత్రణ ఉండాలని, దీనివల్ల సైబర్ నేరాలను తగ్గించవచ్చని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.. అదునతన టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని మనం వాడే పోన్ లో మనకు తెలియకుండానే మనం మన ఎప్పుడో అవసరం వుంది కదా అని సామాజిక మాధ్యమాలలో పెట్టుకుంటాం అదే అదునుగా భావించి దొంగిలిస్తున్నరని ఆయన అన్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఫోన్, మెసేజ్, మెయిల్స్ ఓపెన్ చేయవద్దని, సోషల్ మీడియా లో వచ్చే నకిలీ జాబ్ నోటిఫికేషన్లు నమ్మి మోసపోవద్దని, తక్కువ సమయంలో డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశ,నమ్మకంగా స్నేహం చేసి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నయని, మన బలహీనతే సైబర్ నేరగాళ్ల బలం అని మనం అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చునీ అన్నారు.. ఏదైన సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే బాధితులు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్, www.cybercrime.gov.in లో సమాచారం ఇవ్వాలని ఈ విషయం జిల్లా ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కల్పించేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో పట్టణాలలో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, అంతే కాకుండా జిల్లా పరిధిలో ప్రతి రోజు ఏ రకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో మళ్ళీ అట్టి నేరాలు పురావృత్తం కాకుండా పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు.